Contact: +91 844 894 1008
bgwebsite_logo
Bhagavad Gita
The Song of God

Bhagavad Gita: Chapter 6, Verse 7

జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః ।
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః ।। 7 ।।

జిత-ఆత్మనః — మనస్సుని జయించిన వాడు; ప్రశాంతస్య — ప్రశాంత చిత్తముతో; పరమ-ఆత్మా — భగవంతుడు; సమాహితః — నిశ్చలమై; శీత — చల్లదనంలో; ఉష్ణ — వేడిమిలో; సుఖ — సుఖాలలో; దుఃఖేషు — దుఃఖాలలో; తథా — మరియు; మాన — కీర్తి; అపమానయోః — అపకీర్తి.

Translation

BG 6.7: మనస్సుని జయించిన యోగులు - శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానాపమానములు - ఈ ద్వందములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో, భగవత్ భక్తి యందు స్థిర చిత్తముతో ఉంటారు.

Commentary

2.14వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు - ఇంద్రియములకు ఇంద్రియ-వస్తువిషయ సంపర్కంచే, మనస్సుకి శీతోష్ణములు, సుఖదుఃఖాలు అనుభవంలోనికి వస్తాయి - అని చెప్పి ఉన్నాడు. మనస్సు నిగ్రహింపబడని వరకు, వ్యక్తి ఇంద్రియ భోగ-సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు మరియు కష్టాలనే అనుభూతులను అనుభవిస్తూనే ఉంటాడు. మనస్సుని జయించిన యోగి, ఈ క్షణభంగురమైన తాత్కాలికమైన పరిణామాలను శారీరిక ఇంద్రియ పనులుగా గుర్తించి, అవి నిత్యశాశ్వతమైన ఆత్మ కంటే వేరుగా తెలుసుకొని, వాటిచే ప్రభావితుడు కాడు. అటువంటి ఉన్నత స్థాయి యోగి శీతోష్ణములు, సుఖ-దుఃఖాలు, మాన-అపమానములు వంటి వాటికి అతీతంగా ఉంటాడు.

మనస్సు వసించేందుకు రెండే ప్రదేశాలు ఉన్నాయి - ఒకటి మాయాలోకం, మరొకటి భగవత్ లోకం. ఒకవేళ మనస్సు ప్రాపంచిక ఇంద్రియ ద్వందములకు అతీతంగా ఎదగగలిగితే అది సునాయాసముగా భగవంతుని యందు నిమగ్నమౌతుంది. ఈ విధంగా, పురోగమించిన యోగి యొక్క మనస్సు భగవంతుని ధ్యాసలో సమాధి (గాఢమైన ధ్యానం) యందు స్థితమగును అని, శ్రీ కృష్ణుడు పేర్కొన్నాడు.

Bookmark this Verse

Sign in to save your favorite verses.

Add a Note
Swami Mukundananda
6. ధ్యాన యోగము

Quick Jump to Any Verse

Navigate directly to the wisdom you seek

Book with feather

Stay Connected!

Verse of the Day

Start your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!

Thanks for subscribing to "Bhagavad Gita - Verse of the Day"!